Search

Sunday, May 06, 2012

న్యూజెర్సీలో వైభవంగా శ్రీవారి కల్యాణం



అమెరికాలోని న్యూజెర్సీలో శనివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) తితిదే ఆధ్వర్యంలో శ్రీవారి కల్యాణం వైభవంగా జరిగింది. తిరుమల నుంచి తీసుకొచ్చిన విగ్రహాలకు తితిదే పండితులు శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. గురువాయురప్ప ఆలయంలో జరిగిన ఈ ఉత్సవానికి తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్ కనుమూరి బాపిరాజు హాజరయ్యారు. ప్రవాస భారతీయులతోపాటు పలువులు అమెరికన్లు శ్రీనివాస కల్యాణాన్ని కనులారా వీక్షించారు.

(మూలం: ఈనాడు దినపత్రిక)